అంతర పంటలు:

జీడిమామిడి నాటిన 2-3 సంవత్సరాలలో చెట్ల మధ్య గల స్థలంలో అంతర పంటలుగా వివిధ కూరగాయలు, పొగాకు, వరి, మిరప నార్లను లాభసాటిగా పెంచవచ్చు. పప్పు దినుసు పంటలను అంతర పంటలుగా పెంచటం వల్ల ఆర్థికంగా లాభం పొందటమే కాకుండా, భూసారం వృద్ధిచెంది, జీడిమామిడి మొక్కలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

తోటలలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం వలన నేల గుల్లబారి, గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలను అరికట్టవచ్చు. అదే విధంగా నేలలో వుండే పురుగులు నిద్రావస్థ దశలోనే చనిపోతాయి. కాపుకు వచ్చిన తోటలలో వర్షాలకు ఒకసారి దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి నేల కోతను కొంత వరకు అరికడుతుంది.