గ్రామీణ ప్రాంతంలో ప్రమాదాలు – జాగ్రత్తలు
ఎక్ట్రికల్ షాక్ లేక కరెంటు షాక్
కేబుల్ లేక ఇన్సులేటర్తో కప్పబడని కరెంటు తీగలను ఎవరైనా ముట్టుకుంటే ఎక్ట్రికల్ షాక్ తగులుతుంది. సవ్యంగా లేని ఎక్ట్రికల్ కలెక్షన్లు, స్విచ్చిు, ప్యూజు లేక కరెంట్ తీగల్లో నుండి బయటకు వచ్చిన కరెంటు, ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు గాయాన్ని కలుగజేస్తాయి. తడిగా వున్నప్పుడు కరెంటు వేగంగా పాకుతుంది. కనుక నీళ్ళలో వున్న వ్యక్తికి అది మరీ ప్రమాదకరం.
ఎక్ట్రికల్ షాక్ అత్యవసర పరిస్థితి లేక ఎమర్జన్సీ. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ సేపు కరెంటును ముట్టుకుంటే అతను బ్రతికే అవకాశం అంత తక్కువ.
ఎక్ట్రికల్ షాక్ ప్రభావాలు:
1. శ్వాసకు కారణమయిన మెదడు భాగాన్ని నాశనం చెయ్యొచ్చు (మెదడులో శ్వాస కేంద్రం) ఆ వ్యక్తి ఊపిరి తీసుకోవడం ఆపేయవచ్చు.
2. శ్వాస తీసుకోవడానికి వుపయోగించే కండరాలు చచ్చుబడిపోవచ్చు.
3. గుండె రక్తాన్ని పంప్ చెయ్యడం ఆపేయవచ్చు. లేక గుండె కండరాలు అదరడం మొదలు పెట్టి గుండె సమర్ధంగా రక్తాన్ని పంప్ చెయ్యలేకపోవచ్చు.
4.గుండె కొట్టుకుంటూనే వుండొచ్చు. కానీ ఊపిరి తీసుకోవటం ఆగిపోవచ్చు. అలా జరిగినప్పుడు ముఖం నీలంగా అవుతుంది.
కరెంట్ శరీరంలో ప్రవేశించిన చోట, బయటకు విడిచివెళ్ళినచోట కావచ్చు.
ఏమి చెయ్యాలి?
తెలివిగా, చురుగ్గా వ్యవహరించడం అవసరం. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని ముట్టుకోగూడదు. ముఖ్యంగా కరెంటుని ఇంకా ఆ వ్యక్తి ముట్టుకునేవున్నప్పుడు, మీరు గనుక ముట్టుకుంటే మీకు కూడా ఎక్ట్రిక్ షాక్ వస్తుంది.
బాధిత వ్యక్తి ఇంకా కరెంట్ తీగను ముట్టుకునే వుంటే కరెంట్ స్విచ్చిని ఆపు చెయ్యండి. స్విచ్చి కనపడకపోతే పొడి బల్ల మీద నుంచుని లేక రబ్బరు చెప్పుల్ని వేసుకుని పొడికర్ర లేక వాసం కర్రతో ప్లగ్ని తీసేయడం గాని, కత్తిరించడం గాని చెయ్యండి. కత్తెర, కత్తి లేక లోహంతో చేసిన దేనినీ వుపయోగించకండి.
కరెంట్ని ఆపు చేసే విధానమేమీ లేకపోతే, పొడి వాకింగ్ స్టిక్ లేక వాసం కర్ర లేక చెక్కతో ఆ వ్యక్తిని దూరంగా లాగండి. మీద చేతుకు మందపాటి రబ్బరు గ్లవ్స్, పొడిగుడ్డ లేక అనేక పొరలున్న మందపాటి కాగితం లేక న్యూస్ పేపర్తో పట్టుకుని కూడా అతనిని లాగవచ్చు. లేక పొడి కర్రకు ఒక తాడును వుప్లాగా కట్టి దానిని బాధితుడి కాలికి లేక చేతికి వేసి దూరంగా లాగండి.
ఒకసారి ఆ వ్యక్తి కరెంటుకు దూరంగా భద్రంగా జరిగాక, అతను ఊపిరి తీసుకోకపోయినా, అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయినా లేక గుండె బలహీనంగా కొట్టుకుంటున్నా వెంటనే అతని నోటి మీద నోరు పెట్టి ఊపిరి అందించాలి. కార్డియూక్మసాజ్ చెయ్యాలి. అతనిని హాస్పటల్కు తరలించేటప్పుడు కూడా ఆక్సిజన్ లోపం వల్ల మెదడు ఇంకా దెబ్బతినకుండా వుండేందుకు అలా చెయ్యడం కొనసాగించాలి.
పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకం
ఆశాలత, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతు హక్కుల వేదిక
పశువులను వధ నిమిత్తం అమ్మటాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘‘ప్రివెన్షన్ అఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (రెగ్యులేషన్ అఫ్ లైవ్స్టాక్ మార్కెట్స్) రూల్స్ 2017’’ పేరిట కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆవులు, ఎడ్లు, గేదెలు, కోడె దూడలు, పెయ్యదూడలు, ఒంటె అమ్మకాలపై ఆంక్షులు విధించారు. దీని వల్ల వ్యవసాయానికీ, పశువుల యజమానులైన రైతులకూ, పాడి పశువులను పెంచుకునే మహిళా రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుంది.
మన దేశంలో పశువుల పెంపకం వ్యవసాయానికి అనుబంధంగా సాగుతుంది. సాధారణంగా చిన్న, సన్నకారు రైతులు, పేద రైతులకు రోజుకూలీతో పాటు పశువుల పెంపకం ముఖ్యమైన జీవనాధారం. 2013 నాటి 70వ విడత ఎన్.ఎస్.ఎస్. గణాంకాల ప్రకారం చిన్న, సన్నకారు రైతులు సగటు నెలవారీ ఆదాయంలో 12 శాతం పశువుల పెంపకం నుండి వస్తున్నదని తొస్తున్నది. గతంలో కంటే ఇటీవలి సంవత్సరాలలో పశువుల పెంపకం ప్రాముఖ్యత పెరిగినట్లు కూడా తెలుస్తున్నది.
వ్యవసాయ కుటుంబాలు కొన్ని సంవత్సరాల కొకసారి వాటిని అమ్మి, కొత్తవి కొనటం కూడా సాధారణంగా జరుగుతూ వుంటుంది. రైతులు కరువు సమయంలో పశువులను పోషించలేక, ఆర్ధిక స్థితి దుర్భంగా వుండి అవసరాల కోసం పశువులను అమ్ముకుని మళ్ళీ వ్యవసాయానికి అవసరం వున్నప్పుడు తిరిగి కొనుగోలు చేస్తూ వుంటారు. వ్యవసాయ సీజను ఆరంభంలో సంస్థాగత రుణాలు అందని రైతు పశువులను అమ్ముకుని ఆ డబ్బుని వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టటం కూడా జరుగుతున్నది. రైతులు సాధారణంగా పశువుల అమ్మకాలు, కొనుగోళ్ళు స్థానిక మార్కెట్లలో చేస్తుంటారు.
ఇప్పుడు పశువుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పశువులను అమ్మానుకునే రైతులు తాము వాటిని వధించటానికి అమ్మటం లేదని అధికారులు ధ్రువ పరచిన పత్రాలను జతచేయవలసి వుంటుంది. వాటిని కొనుగోలు చేసేవారు తాము వ్యవసాయం కోసమే కొంటున్నామని హామీ పత్రం ఇవ్వవలసి వుంటుంది, అంతే కాదు 6 నెలల వరకు వాటిని తమ వద్దనే వుంచుకోవాలి, 6 నెలలోపు అమ్మకూడదు.
చిన్, సన్నకారు పేద రైతులు పశువులను అమ్మటానికీ, కొనటానికీ అనేక ధృవీకరణ పత్రాలను, హామీ పత్రాలను, గుర్తింపు కార్డులను, అధికారులు సంతకాలను చూపించాల్సి రావటం వల్ల రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. పశువులును అమ్మకూడదు అనే ఆంక్షలు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
పైకి పశువు పట్ల క్రూరత్వాన్ని నివారించటం దీని ఉద్దేశ్యం అని చెబుతున్నప్పటికీ ‘‘ఆవు పవిత్రమైనది, అవును పూజించాలే కానీ వధించి గొడ్డు మాంసం తినకూడదనే’’ మతపరమైన దృష్టికోణం నుండి మాత్రమే ఈ నియంత్రణ విధించటం జరుగుతున్నది. కొన్ని శతాబ్దాుగా ప్రభుత్వాు అనుసరిస్తున్న తప్పుడు విధానా వ్లనే మన దేశంలో స్థానిక పశుల జాతుల సంఖ్య తగ్గిపోవటానికి దారి తీసింది. (మేత భూములు తగ్గిపోవటము,
వేసవిలో మేత నీరు కొరతగా వుండటము, అధిక పాల దిగుబడి కోసమంటూ విదేశీ పశుల జాతులను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టటము, వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల పశువుల అవసరం తగ్గిపోవటము వంటివి.)
నిజానికి రైతులు పశువులను అత్యంత ప్రేమతో పోషించి తమ కుటుంబంలో భాగంగా కాపాడుకుంటారు. కానీ చిన్న, సన్నకారు రైతులు ప్రస్తుత దుర్భమైన ఆర్ధిక పరిస్థితిలో వాటిని తప్పని పరిస్థితిలో అమ్మవలసి వస్తున్నది. సాధారణంగా చాలా కాలం పని చేసి, ఇక వ్యవసాయానికి పనికి రాని పశువులను, వయసు మళ్ళిన, జబ్బుపడ్డ పశువులను రైతులు పోషించలేక అమ్ముతుంటారు, వ్యాపారస్తులు వాటిని కబేళాలకు తరలిస్తుంటారు. రైతులు తిరిగి తమ వద్ద నున్న ఆవుల సంతతి నుండి కొత్తగా ఎడ్ల జతలు తయారు చేస్తారు లేక మార్కెట్లో కొనుగోలు చేస్తారు.
ఇప్పుడు అమ్మకాల పై ఇంతటి తీవ్రమైన ఆంక్షలు విధిస్తే వాటిని కబేళాలకు తరలించే వ్యాపారులు కొనటానికి ముందుకు రాక రైతులకు అమ్ముకునే అవకాశం వుండదు. ఒక అంచనా ప్రకారం ఒక ఆవులనో, గేదెలనో పోషించటానికి సంవత్సరానికి దాదాపు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పశువులు వ్యవసాయానికో, మరొక రకంగానో పనికి వచ్చే ఉత్పత్తిని ఇవ్వనప్పుడు ఆ పశువులను మేపాంటే రైతులకు తలకు మించిన భారం అవుతుంది.
చాలా మంది పేద కుటుంబాల మహిళలు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులను పెంచుకుని పాల అమ్మకం ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. వారికేదైనా కష్టం వస్తే పాడిపశువులను అమ్మి ఆ తర్వాత డబ్బు వున్నప్పుడు తిరిగి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ కొత్త నియంత్రణ వల్ల మార్కెట్లో పశువులను కొనాలన్నా, అమ్మాలన్నా అనేక ఆంక్షలు వుండటం వల్ల మహిళలు, మహిళా రైతులు కూడా నష్టపోతారు.
‘గో రక్షకుల’ చేతిలో ఇప్పటికే అనేక మంది దళితులు, ముస్లిలు దాడులకు గురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ నియంత్రణా ఆదేశాల కారణంగా పశువులను అమ్మటానికి వెళ్ళే రైతులు కూడా వారి దాడులకు బలయ్యే ప్రమాదం వుంది.
పశువులను కాపాడటానికి ప్రభుత్వం వాటి పోషణకు అనుకూలమైన పరిస్థితులు, సదుపాయాలు కల్పించాలి, స్థానిక పశుజాతులను ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలి. వ్యవసాయంలో వాటి సాంప్రదాయ పాత్రను పునరుదరించాలి. అంతేకానీ వాటి అమ్మకాలపై ఆంక్షలను, నిషేధాలను విధించటం కాదు.
వేసవిలో పశువుల సంరక్షణ
వేసవి కాంలో పశువుకు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవసరం. ముఖ్యంగా గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవుకు వేసవి తీవ్రత ప్రాంతాన్నిబట్టి మారుతుంది. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ ఎక్కువగా వుండటం వల న, ఈ వాతావరణం పశువులకు వడదెబ్బ తగలడానికి అనుకూలం. మన దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి. మాళీ గేదెలు ఎండకు తట్టుకోలేక, పాలు తగ్గడం, ఎదకు రాకపోవడం, ఒకవేళ ఎదకు వచ్చినా లక్షణాలు సరిగా కనిపించక పోవడంలాంటి సమస్యలను ఎదుర్కొంటాయి. సంకరజాతి ఆవులు మరియు ఇంగ్లీషు ఆవులు ఎండ తీవ్రతకు గురై, పాలు పూర్తిగా తగ్గిపోయి, రొప్పుతూ మేత మేయక, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి, రోగనిరోధక శక్తిని కోల్పోతాయి.
దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి కాబట్టి, మాళీ గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవులకు వేసవి నుండి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా వున్న ప్రాంతాలల్లో పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
- పశువులను ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు వదలాలి. మిట్ట మధ్యాహ్నం పశువులు ఎండలో తిరిగినట్లయితే, పాదిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.
- పశువులకు ఎల్లపుడు చాలినన్ని చల్లని నీటిని అందుబాటులో వుంచాలి. నీరు ఎక్కువగా తాగిన కొద్దీ, శరీరంలోని వేడి తగ్గిపోతుంది.
- గేదెలు మధ్యాహ్నం 2-3 గంటలసేపు చెరువులో పడుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వలన శరీర ఉష్ణోగ్రత పెరగకుండా వుంటుంది.
- పగులు గేదెలను చల్లటి చెట్ల క్రింద కట్టివేసి, 2-3 సార్లు నీటితో తడపాలి.
- గేదెలను పాలు తీసేముందు పొదుగును, శరీరమును చల్లటి నీటితో కడిగినట్లయితే, అవి సుమారు ఒక లీటరు పాలను ఎక్కువగా ఇస్తాయని పరిశోధనల ద్వారా వెల్లడయింది.
- పశువులు వేసవిలో క్రొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా జీర్ణించుకోలేవు. కాబట్టి వీటిని తగ్గించి, శక్తినిచ్చే పిండిపదార్థాలను ఎక్కువగా తింటాయి. ఇది గేదెల విషయంలో మరీ ముఖ్యం. అధిక వేడి వల్ల పశువు పొట్టలో జీర్ణ రసాయనాలు తగు మోతాదులో ఉత్పత్తి కావు. అందుకే గేదెలను 2-3 సార్లు కడిగినట్లయితే, ఈ రసాయనాలు తిరిగి ఉత్పత్తి అవుతాయని పరిశోధనల ద్వారా తెలిసింది. కాబట్టి వేసవిలో మడ్డికూడు, జావ తగు మోతాదులో మిశ్రమ దాణాతో పాటుగా ఉప్పు కూడా కలిపి పశువులకు మేపాలి.
- పశువు రేకుల షెడ్డులో వుంటే, రేకుపైన తాటాకులుగానీ, వరిగడ్డిని గానీ కప్పి తడుపుతూ వుండాలి. చుట్టూ చాపు లేదా గోతాము పట్టాలు కప్పి మధ్యాహ్నం వేళల్లో 2`3 సార్లు ఆ పట్టాలను నీటితో తడపాలి. సాయంత్రం వేళల్లో రాత్రిపూట గేదెలను ఆరు బయట పడుకోనివ్వాలి.
- వేసవిలో పచ్చిమేత లేనిదే ఇంగ్లీషు ఆవులు వేడికి తట్టుకోలేవు. తప్పనిసరిగా పేరా గడ్డి, గిన్నీ గడ్డి, నేపియర్ గడ్డి మరి ఏ ఇతర పశుగ్రాసాన్నయినా వాటికి అందించాలి. ఈ గ్రాసాల్లో విటమిన్ ‘ఏ’ ఎక్కువగా వుండి రోగనిరోధక శక్తిని, జనన శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఈ పశుగ్రాసాల్లో నూటికి 85`90 శాతం నీరు వుండడం వలన, తేలికగా జీర్ణమయ్యి, పశువు పొట్టలో కావలసిన ‘బ్యాక్టీరియా’ మరియు ‘ప్రోటోజోవా’ను అభివృద్ధి చేసి పశువు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వేడిని కూడా తగ్గిస్తాయి.
- పశువుల పాకల్లో చల్లదనాన్ని ఇవ్వగలిగితే, అవి ఎదకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. పాకల చుట్టూ పట్టాలు కప్పి, వాటిని తడపడం ద్వారా గాని లేదా ప్రత్యేకమైన మందుల ద్వారా గానీ పశువులను ఎదకు తెప్పించవచ్చు.
ఇలా పైన చెప్పిన సూచను పాటించినట్లయితే, పశువులను వేసవిలో కూడా సంరక్షించుకొని, పాదిగుబడి తగ్గకుండా పొందడానికి అవకాశముంది.
వేసవిలో కూరగాయల సాగు – జాగ్రత్తలు
వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధక మవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతును చేపట్టి, ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుని కూరగాయలసాగుపై ప్రత్యేక శ్రద్దవహిస్తే అధికలాభాలు పొందుతారు.
వేసవిలో నారును నీడ క్రింద పెంచాలి. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. నారుమళ్ళపై నైలాన్ వల్ల ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు. మళ్ళలో మొత్తం విత్తనాన్ని ఒకేసారి విత్తకుండా విడతలుగా విత్తుకోవటం మంచిది. దీని వల్ల ఒక సమయంలో పండిరచిన కూరగాయ పంట దెబ్బతిన్నా లేదా పంటదిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ ధర పలికితే, ఇంకో సమయంలో విత్తిన పంట నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.
పొలంలో అముదం, మొక్కజొన్న లాంటి పంటను నీడనిచ్చే విధంగా ఉత్తర దక్షిణ దిశలో నాటుకోవాలి. లేదా రైతులు వీలైతే 35 శాతం షేడ్నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు.
వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత ఎక్కువ ఉండేటట్లు చూడాలి.
ఉదా: వర్షాకాలంలో 60 x 45 సెం.మీ. దూరంలో టమాట నాటుకుంటే, వేసవిలో 45 x 30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. 2.0 x 0.5 మీ. దూరంలో బీర విత్తుకోవాలి. వర్షాకాలం పంటకు ఎకరాకు 4 కిలో బెండ విత్తనం వాడితే, వేసవి పంటకు 6 కిలో విత్తనం వాడాలి.
వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో మొదటి 3-4 సంవత్సరాల అంతరపంటలుగా బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరుచిక్కుడు వంటి కూరగాయలపంటను సాగుచేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు.
నేలలోని తేమను సంరక్షించే చర్యులు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితోపాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ ఎరువు ఎక్కువగా వాడటం వల్ల నేల గుల్లబారి, తేమను ఎక్కువ రోజులు పట్టివుంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. పాదుల్లో, రెండు వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను నేలపై పరిస్తే నేలలో తేమ సంరక్షించబడి మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండటమేగాక కలుపు పెరుగుదలను అరికడుతుంది.
ఉన్న కొద్దిపాటి నీటిని బిందు (డ్రిప్) లేదా తుంపర్ల (స్ప్రింక్లర్) పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలను పండిరచవచ్చు. ఒక ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్పు ద్వారా 2 1/2 ఎకరాలలో, తుంపర్ల పద్ధతిలో 1 1/2 – 2 ఎకరాలలో సాగుచేయవచ్చు. నీరు సక్రమంగా ఇవ్వటం వల్ల తుంపర్ల ద్వారా ఎండవేడి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటలలో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళ నీటిని పిచికారీ చేయాలి. టమాటలోనూ, పుచ్చలోనూ నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయపగుళ్ళు కనబడతాయి. కాయగూరలను, ఆకుకూరలను, చ్లటి పూట కోసి, తడిగోనె సంచి కప్పి మార్కెట్కి పంపాలి.
సమగ్ర సస్యరక్షణ
మామిడి పంటను వివిధ దశలో అనేక రకాలైన పురుగులు, తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. మామిడి నాశించే ముఖ్యమైన పురుగులు, తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులు ఈ దిగువన సూచిస్తున్నాం.
మామిడిని ఆశించే పురుగులు – నివారణ:
తేనె మంచు పురుగులు (మాంగో హాపర్స్)
లక్షణాలు :
తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుండి విపరీతంగా రసాన్ని పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినపుడు ఆకుల చివర్లు, అంచులు మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందేలు ఏర్పడవు. ఇంతే కాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై ‘కాప్నోడియం’ మరియు మీలియోలా’ అనే శిలీంద్రాలు పెరగటం వల్ల ఆకులపై, పూత కాడలపై, కాయలపై నల్ల మసి పొర ఏర్పడుతుంది. దీని వల్ల ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి.
నివారణ:
- ఈ తేనెమంచు పురుగులను అదుపులో ఉంచేందుకు 5 శాతం వేపకషాయం పూత మొదలయ్యే సమయంలో పది రోజు వ్యవధిలో 2 సార్లు, పిందెలు తయారయ్యే సమయంలో 2 సార్లు మొక్కపై బాగా పిచికారీ చెయ్యాలి. చెట్టు వయసును బట్టి సుమారు 10 నుండి 20 లీటర్ల మందు ద్రావణం పడుతుంది.
- పశువుల మూత్రం 1 లీటరు, 10 లీటర్ల నీటిలో కలిపి, 1`2 సార్లు 15 రోజు వ్యవధిలో పిచికారీ చేయాలి.
తామర పురుగులు (మంగు – త్రిప్స్)
లక్షణాలు :
తామర పురుగులు 2 మి.మీ. పొడవుండి, చిన్న రెక్కులు కలిగి సూక్ష్మంగా వుంటాయి. ఇవి కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి, రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి ఆ తరువాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై చర్మాన్ని గోకి, బయటకు వచ్చిన రసాన్ని పీల్చి వేస్తాయి. ఇవి ఆశించిన కాయలపై రాతిమంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత పడిపోతుంది.
నివారణ:
ఈ పురుగుల నివారణకు వేపనూనె 2 మి.లీ. లీటరు నీటికి కలిపి కాయపై పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి.
పూత నాశించే పురుగులు
లక్షణాలు :
ఈ పురుగులు పూల గుత్తులను ఆశించి పూతను తిని విపరీతంగా నష్టపరుస్తాయి. ఇది ఆశించిన పూల గుత్తుల్లో పిందెలు ఏర్పడవు.
నివారణ:
ఈ పురుగు నివారణకు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం పూత సమయంలో గుత్తుపై పిచికారీ చేయాలి.
టెంక పురుగు
లక్షణాలు :
టెంక పురుగు వలన కాయ లోపలి భాగం పుచ్చిపోయి కాయలకు నష్టం కలుగుతుంది.
నివారణ:
- కాయ కోత అయిన తరువాత ప్రతి సంవత్సరం మామిడి చెట్టులోని ఎండు పుల్లల్ని , కొమ్మల్ని తొలగించి కాల్చి వేయటం వల్ల చాలా వరకు ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
- పిందెలు గోలికాయ సైజులో ఉన్నప్పుడు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం 10 రోజు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
- తోటల్లో అక్కడక్కడా దీపపు ఎరలు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో చిన్న చిన్న మంటలు వేసి తల్లి పురుగులను నాశనం చేయాలి.
పిండి నల్లి
లక్షణాలు :
భూమిలో పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు చెట్టు పైకి పాకి లేత రెమ్మలు కాయలు, తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి.
నివారణ:
- ఈ పురుగు నివారణకు చెట్ల పాదులో చెట్టు వయస్సును బట్టి 2-5 కిలో వేప పిండి లేదా కానుగ పిండి లేదా ఆముదం పిండి చల్లి మట్టిలో కపాలి.
- ఇవి ఆశించిన కొమ్ము, కాయపై లీటరు నీటికి 2 మి.లీ. వేప నూనె 10 రోజు వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- తొలకరిలో భూమిని చెట్టు మొదలుకి దగ్గరగా దున్నాలి. లేదా పాదులను తవ్వి తిరగెయ్యాలి.
కాయ కొట్టే ఈగ
లక్షణాలు :
ఈ పురుగు ఆశించిన కాయలు తొందరగా మాగి రాలిపోతాయి. తల్లి ఈగలు లేత ఎరుపు వర్ణంతో పారదర్శకమైన రెక్కులు కలిగి ఉంటాయి. ఈ ఈగ కాయ పక్వానికి దగ్గర వచ్చినప్పుడు కాయ చర్మం కింద గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయలోని కండ తిని పెద్దవవుతాయి. ఆలస్యంగా కోతకు వచ్చే నీలం, తోతాపురి రకాల్లోనూ, నీలేషాన్ సంకరంలోనూ ఈ ఈగలబెడద ఎక్కువ ఉంటుంది.
నివారణ:
- కాయలు తయారయ్యే సమయంలో ప్రతి 5 మామిడి చెట్లకు ఒక కాయ కొట్టే ఈగ ట్రాప్స్ అమర్చాలి. తోటలోని ఈగలు ఈ ఎరకు ఆకర్షించ బడతాయి.
- ఈగ ఆశించి రాలిన కాయల్ని పోగుచేసి తోటకు దూరంగా నాశనం చేయాలి.
- పొలాన్ని శుభ్రంగా ఉంచాలి.
కాండం తొలుచు పురుగు
లక్షణాలు :
ఈ పురుగు సాధారణంగా పాత తోటల్లో, నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటి లద్దె పురుగులు కాండాన్ని, కొమ్మని తొలిచి తినేస్తాయి. తద్వారా చెట్లు బలహీనమవుతాయి. కొమ్మలు ఎండి పోతాయి. చెట్లు చనిపోతాయి.
నివారణ:
- చెట్టుకు రంధ్రాలు చేసిన కన్నంలోని పురుగులను సన్నని ఊచతో తీసేయాలి. వాటిని నాశనం చెయ్యాలి.
- రంధ్రం చుట్టూ ఉన్న వ్యర్ధ పదార్థాలను బాగా శుభ్రం చేసి, వేపనూనెలో ముంచిన దూదిని కన్నాల్లోకి పెట్టి పైన బంక మట్టితో మూసి వేయాలి.
- తోటలో పూర్తిగా ఎండిపోయిన చెట్లను, కొమ్మను ఎప్పటికప్పుడు తొలగించి, పొలాన్ని శుభ్రంగా ఉంచాలి.
మామిడిని ఆశించే తెగుళ్ళు – నివారణ
బూడిద తెగులు (పౌడరీ మిల్ డ్ల్యూ)
లక్షణాలు :
కాడలపై, పూల మీద, చిరుపిందెల మీద తెల్లని పౌడరు లాంటి బూజు ఏర్పడుతుంది. ఈ బూజు వల్ల పూు, పిందొ వడలిపోయి రాలిపోతాయి. పంటకు నష్టం కుగుతుంది.
నివారణ:
- పూత, మొగ్గులు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- శొంఠిపాల కషాయం కూడా ఒకసారి పిచికారీ చేయవచ్చు.
ఆకుమచ్చ తెగులు
లక్షణాలు :
ఈ తెగులు కొల్లోటోట్రైకం అనే బూజు (శిలీంధ్రం) వల్ల వస్తుంది. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చు ఏర్పడి క్రమంగా మచ్చలు కలిసిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. లేత రెమ్మలపై నల్ల మచ్చులు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. తెగులు సోకిన కాయల పై న్లటి గుంత మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి.
నివారణ:
- పూత దశకు ముందే ఎండిన కొమ్మలను తీసివేసి వాటిని నాశనం చేయాలి.
- బోర్దో మిశ్రమం 1 శాతం లేదా 3 గ్రాముల కాపర్ అక్సీక్లోరైడ్ చెట్లపై పిచికారీ చేయాలి.
- బాగా పులిసిన పుల్లని మజ్జిగ 6 లీటర్లు + 100 గ్రాముల ఇంగువ, 100 లీటర్ల నీటిలో కలిపి చెట్లపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మసి తెగులు (సూటీ మోల్డ్)
లక్షణాలు :
ఈ తెగులు ‘క్యాప్నోడియం’ అనే శిలీంద్రం ద్వారా వస్తుంది. రసం పీల్చే తేనెమంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్థం ఆకుల మీద పిందెలు, కాయల మీద పడి నల్లని మసిలా పెరుగుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. కాయసైజు తగ్గిపోయి, రాలిపోతాయి.
నివారణ:
- రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం (లేదా) నీమాస్త్రం ఉపయోగించి అరికట్టాలి.
- 2 కిలోల గంజి పొడిని (స్టార్చి) 5 లీటర్ల వేడి నీటిలో కలిపి, దీనికి 100 లీటర్ల నీటిని చేర్చి గంజి ద్రావణం తయారు చేయాలి. గంజి ద్రావణాన్ని మసి తెగులు సోకిన చెట్ల కొమ్మలకు, ఆకులపై, కాయలపై బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి.
- పశువుల పేడ + మూత్రం ద్రావణం 2 సార్లు 10 రోజుల వ్యవధిలో తెగులు సోకిన భాగాలపై పిచికారీ చేయాలి.
- ఈ విధంగా చేయటం వల్ల మసి తెగులు చిన్న చిన్న పెళ్ళఆలుగా గంజి పొడితో కలిసి ఎండకు ఎండి రాలిపోతుంది. పంట ఆరోగ్యంగా ఉంటుంది.
2020-21 బడ్జెట్లో వ్యవసాయరంగానికి ప్రధాన్యత ఇవ్వాలి
అఖిల భారత రైతు సంఘాల పోరాటాల సమన్వయ సమితి – ఎ.ఐ.కె.ఎస్.సి.సి.
2020-21 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి చర్చించి మీ ముందు నిర్ధిష్టమైన ప్రతిపాదలను వుంచాలని భావించింది. మీరు పరిశీలించి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తగిన ప్రధాన్యత వుండే విధంగా చర్యలు తీసుకోవాని కోరుతున్నాం.
2020-21 వ్యవసాయ బడ్జెట్లో ఈ దిగువ అంశాలు, వాటికి కావాల్సిన బడ్జెట్ను కేటాయించాలి.
1. గతంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. వచ్చే బడ్జెట్లో కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలి.
2. రైతుబంధు పథకం వాస్తవ సాగుదారులందరికీ అమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
3. రైతుబీమా: రైతు బీమా పథకాన్ని వ్యవసాయం చేస్తున్న రైతుందరికీ వర్తింపజేయాలి. వ్యవసాయ కార్మికుకు, కౌలుదారుకు కూడా బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించాలి.
4. రుణమాఫీ: రైతుకు లక్షలోపు (రూ. 24,000 కోట్లు) ఒకే సారి చెల్లించే విధంగా మొత్తం రుణాన్ని ప్రభుత్వం తన ఖాతాకు జమ చేసుకొని విడత వారీగా బ్యాంకుకు చెల్లించాలి.
5. రుణాలపై వడ్డీ: కేంద్రం ఇస్తున్న వడ్డీమాఫీ కాకుండా రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ కార్మికుల రుణాలకు వడ్డీ మాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లు చెల్లించాలి.
6. ప్రకృతి వైపరీత్యాల పరిహారం: ప్రకృతి వైపరీత్యాల పరిహారం కింద 15వ ఫైనాన్స్ కమీషన్ కేటాయింపులతో పాటు రాష్ట్ర బడ్జెట్లో రూ. 3,500 కోట్లు (కేంద్రం, రాష్ట్ర 75:25 శాతం) కోట్లు కేటాయించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 20,000 పరిహారంగా చెల్లించాలి.
7. పంట బీమా: పంట బీమా ప్రీమియం పూర్తిగా (రూ. 1,000 కోట్లు) ప్రభుత్వమే రైతులందరికీ చెల్లించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీమా పథకంలో చేరడాన్ని రైతు స్వేచ్ఛకు వదిలి వేసింది. ఈ పథకం వల్ల రైతు అనాసక్తి చూపుతారు. విధిగా రైతులందరికి పంట బీమా పథకంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి.
8. మార్కెట్ జోక్యం కేటాయింపు: ప్రభుత్వ నిర్ణయించిన ధరలు మార్కెట్లో అమలు జరిపించటానికి రూ. 4,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. ఈ నిధులతో మార్కెట్లో ప్రభుత్వం కనీస మద్ధతు ధర కొనుగోళ్ళు చేపట్టాలి. లేదా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మినచో మద్ధతు ధరలకు తక్కువ వచ్చిన లోటును ఈ నిధుల ద్వారా రైతులకు పూడ్చాలి. మార్కెట్లో ‘వే బ్రిడ్జి’ు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వే బ్రిడ్జిలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి.
9. హార్టిక్చర్ : రుణాల మాఫీకి మరియు హార్టిక్చర్ యూనివర్సిటీ, హార్టిక్చర్ సబ్సిడీ (మొక్క సబ్సిడీ, పామాయిల్ సబ్సిడీ), తదితర పద్దులకు రూ. 1,500 కోట్లు కేటాయించాలి.
10.సెరీకల్చెర్ : సెరీకల్చెర్ అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయింపు చేయాలి.
11. పశు పోషణ, డెయిరీ అభివృద్ధి: పశు పోషణ, డెయిరీ అభివృద్ధి నిర్వహణకు కేంద్రం నుండి వచ్చేల నిధులు కాక రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించాలి. పెరుగుతున్న ధరకనుగుణంగా రైతుకు పాల సేకరణ సబ్సిడీకి లీటరుకు రూ. 10 అదనంగా సబ్సిడీ ఇవ్వాలి. అందుకు కావాల్సిన నిధులు కేటాయించాలి.
12. వ్యవసాయ పరిశోధనలు: పంట పరిశోధనలకు జయ శంకర్ విశ్వవిద్యాలయానికి, హార్టిక్చర్, పశు పోషణ యూనివర్సిటీలకు రూ. 500 కోట్లు కేటాయించాలి. వాతావరణ పరిస్థితులకనుగుణంగా విత్తన తయారీకి ప్రత్యేక శ్రద్ధ చూపాలి.. రాష్ట్రంలో 27 పరిశోధన కేంద్ర మరియు వాటికి తగిన భూమి కూడా వుంది.
13. చవిటి నేలలు బాగుచేయుటకు: (జిప్సం, జింక్) సరఫరాలతో పాటు ఇతర పథకాలను అమలు చేయుటకు రూ. 600 కోట్లు కేటాయించాలి.
14. ఇందిర ప్రభ, ఇందిర జల ప్రభ: పథకాల ద్వారా (దళిత, గిరిజనులకు) భూమిని చదును చేయుటకు బోర్లు వేయుటకు రూ. 1,000 కోట్లు కేటాయించాలి.
ప్రభుత్వం నిర్వహించాల్సిన చర్యలు:
15. సహకార వ్యవస్థ అభివృద్ధి: గ్రామ, జిల్లా సహకార సంఘాల ఆర్థిక లోటులో కొనసాగుతున్నాయి. కేరళ తరహా ప్రభుత్వ బడ్జెట్ డిపాజిట్లు సహకార సంఘాలలో పెట్టాలి. ఆ విధంగా బ్యాంకులకన్న ఎక్కువ రైతుకు సేవ చేసే వివిధ సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి.
16. రైతు కుటుంబాలకు : విద్య, వైద్య సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం పూర్తి రాయితీ ఇవ్వాలి. ఢిల్లీ రాష్ట్రం మాదిరిగా విద్య, వైద్య సౌకర్యము కల్పించాలి.
17. వ్యవసాయ విస్తరణ: ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయరంగంలో 7,296 పోస్టు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు ప్రతి 2,500 ఎకరాకు ఒక ఎ.ఇ.ఓ.ను నియమించాలి.
18. విత్తన సబ్సిడీ: హైబ్రిడ్ వెరైటీలు వేసే వారికి పూర్తి విత్తన సబ్సిడీ ఇవ్వాలి. విత్తనాలు, మార్కెట్ కమిటీల ద్వారా మాత్రమే అందించాలి. విత్తన కల్తీ నిరోధక చట్టం తేవాలి. ప్రస్తుత శాసనసభ సమావేశాలో రాష్ట్ర విత్తన చట్టం రూపొందించి ఆమోదింపచేయాలి. కేంద్ర చట్టం తెచ్చినప్పుడు రాష్ట్ర చట్టం దానికి లోబడి వుంటుంది.
19. కౌలుదారులు: కౌలుదారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తూ సహకార సంఘాల ద్వారా వారీ ఆదాయాన్ని అభివృద్ధి పరచాలి.
20. పంట రుణాలు: పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులందరికీ మొత్తం సాగు భూమికి తగిననన్ని రుణాలు ఇవ్వాలి. ఇంత వరకూ రాష్ట్రంలో 59 లక్ష మంది రైతు వుండగా 29 లక్ష మంది రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. దాదాపు సగం మంది రైతులు ఇంత వరకు బ్యాంకు గడప తొక్కలేదు. రైతులందరికీ పంట రుణాలు ఇవ్వడం వన ప్రైవేట్ రుణాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
21. ధర నిర్ణయాక సంఘం ఏర్పాటు: రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులకు ధరలు నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయాక సంఘాన్ని (కర్నాటకలో లాగా) ఏర్పాటు చేయాలి.
22. నిల్వ గోదాముల ఏర్పాటు: తగినన్ని గోదాములు ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అన్ని మార్కెట్ యార్డులలో కోల్డ్ స్టోరేజ్, కామన్ గోదాములు ఉండాలి. ఇవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా రైతులకు అందుబాటులో వుంచాలి.
23.పోడు భూముల సమస్యలు: ఏజెన్సీలో వాస్తవ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి. వారికి రుణ సౌకర్యంతో పాటు ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలి.
24. పంటలకు బోర్డును: పంటలకు బోర్డును ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిశోధన, విస్తరణ, ఉత్పాదకత పెంపు, భూసార పరీక్షలు, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా అన్ని పంటలకు రక్షణ కల్పించాలి.
25. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సౌకర్యం: ఐ.డి.సి. ద్వారా దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారికి బోర్లు వేయుట, నిర్వహణ చేయుటకు ఐ.డి.సి.ని వినియోగించాలి. లిఫ్ట్ పథకాలు వారి ద్వారానే నిర్మానం చేయించాలి. గతంలో ఈ డిపార్ట్మెంట్కు కేటాయించిన నిధులకు అదనంగా భూమి పన్నుల ద్వారా తమ వేతనాలు పోగా నిల్వ సంపాదించారు.
26. అడవి జంతువుల నివారణ: అడవి జంతువు వన పంట నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పంట నష్టం జరిగినచో ప్రభుత్వం ముందు రైతులకు చెల్లించి ఆ తరువాత అటవీ శాఖ నుండి రికవరి చేసుకోవాలి.
27. కోళ్ళు, చేపలు, చిన్న పశువులు: (గొర్రొలు, మేకలు, పందులు) పెంపకానికి బ్యాంకు ద్వారా రూ. 3 లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇప్పించాలి.
28. రైతులకు పెన్షన్: అరవై ఏళ్ళు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ. 10000 పెన్షన్ ఇవ్వాలి.
29. వాతావరణ పరిశోధన: వాతావరణంలో వస్తున్న మార్పు పై అధ్యయనం చేసి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
30. ప్రాజెక్టులు: ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
బడ్జెట్ కేటాయింపులు
| 1 | రైతు బంధు | రూ. 14,000 కోట్లు |
| 2 | పంట బీమా ప్రీమియం | రూ. 1,000 కోట్లు |
| 3 | రైతు బీమా ప్రీమియం | రూ. 3,200 కోట్లు |
| 4 | రైతులకు లక్ష లోపు రుణమాఫీ (రూ. 24000 కోట్లు) | రూ. 6,000 కోట్లు |
| 5 | రుణాలపై వడ్డీ మాఫీ | రూ. 1,000 కోట్లు |
| 6 | ప్రకృతి వైపరిత్యాల పరిహారం | రూ. 3,500 కోట్లు |
| 7 | మార్కెట్ జోక్యం కేటాయింపులు | రూ. 4,000 కొట్లు |
| 8. | హర్టీకల్చర్ సబ్సిడీ రుణాల రద్దు | రూ. 1,500 కొట్లు |
| 9. | సెరీ కల్చర్ | రూ. 400 కోట్లు |
| 10. | డెయిరీ అభివృద్ధి, సబ్సిడీ | రూ. 500 కోట్లు |
| 11. | వ్యవసాయ పరిశోధలను, యూనివర్సిటీలు | రూ. 500 కోట్లు |
| 12. | చవిటి నేలలు బాగుచేయుటకు | రూ. 600 కోట్లు |
| 13. | ఇందిరా ప్రభ, ఇందిరా జల ప్రభ పథకాలు | రూ. 1,000 కోట్లు |
| మొత్తం | రూ. 37,200 కోట్లు |
పై చర్య కొంత మేరకు వ్యవసాయ వుత్పత్తి, ఉత్పాదకాలతో పాటు ఆత్మహత్య నివారణకు అవకాశం వుంటుంది. పై సూచనను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం.
తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!
రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవలు, చట్టాలు & పరిపాలనలో తేవాల్సిన మార్పులు
తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. గత సంవత్సర కాలంగా రెవిన్యూ పరిపాలనా సంస్కరణలపై, చట్టాలలో మార్పుల ఆవశ్యకతపై రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి పలు సందర్భాలలో కొత్త రెవిన్యూ చట్టం తెస్తాము అని ప్రకటించారు. రైతులకు మేలు జరుగాలంటే రాబోయే కొత్త చట్టం, భూపరిపాలనలో మార్పులు ఏవిదంగా ఉండాలో కొన్ని సూచనలు, అభిప్రాయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము. వీటిపై విస్తృతంగా చర్చజరిగితే రైతులకు హితం.
సమస్యలు ఏంటి?
- భూమి రికార్డులు – ఏ రికార్డు భూమి పై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ రికార్డునైన ఎప్పుడైనా సవరించవచ్చు. భూ రికార్డులలోని వివరాలకు భరోసా లేదు. జామాబందీ, అజమాయిషీ ఆగిపోయింది. వాస్తవ పరిస్థితికి అద్దం పట్టని భూ రికార్డులు.
- సర్వే – భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. 40 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన భూముల సర్వే 80 ఏళ్ళైన జరగలేదు.
- భూవివాదాలు – ఏ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు ఏవిధంగా వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. రెవిన్యూ కోర్టులలో వేల సంఖ్యలో భూ వివాదాలు ఉన్నాయి. రెవెన్యూ కోర్టులలో ఉన్న కేసుల సమీక్ష జరగటం లేదు. సివిల్ కోర్టులలో 66% కేసులు భూ తగాదాలే. భూ వివాదాల వలన ప్రతి సంవత్సరం 1.3% జి.డి.పి. నష్టం.
- న్యాయసహాయం – పేదలకు అండగా ఉన్న పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ అటకెక్కింది. న్యాయ సేవా సంస్థలనుంచి అందని సాయం.
- చట్టాలు – లెక్కకు మిక్కిలి భూమి చట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు. చట్టాలలో గందరగోళం. అసంపూర్ణం గా మిగిలిన చారిత్రక భూ చట్టాల (సీలింగ్, టెనెన్సీ, ఇనాం) అమలు.
- భూపరిపాలన – భూ పరిపాలనకు తగిన సమయం ఇవ్వలేని రెవెన్యూ శాఖ. చట్టాలు, నియమాల పై శిక్షణ కరువు.
ప్రభుత్వ ప్రయత్నాలు
i. భూ రికార్డుల ప్రక్షాళన – LRUP – రైతులకు కొత్త పాసుపుస్తకాల జారీ.
ii. భూముల సర్వేకి ప్రయత్నాలు.
iii. భూ చట్టాల సమీక్ష, నల్సార్ విశ్వవిద్యాలయం నివేదిక
iv. ఆర్.ఓ.ఆర్, పి.ఓ.టి, నాలా చట్టాలలో మార్పులు
v. సాదాబైనామాల క్రమబద్దీకరణ
vi. కొత్త రెవిన్యూ చట్టానికై ప్రయత్నాలు
తేవాల్సిన మార్పులు
A. సర్వే: సమగ్ర భూ సర్వే జరగాలి. భూముల సమగ్ర సర్వే చేసి కొత్తగా భూరికార్డులను రూపొందించడం తక్షణ అవసరం. భూముల సర్వే సకల సమస్యలకు పరిస్కారం.
B. రెవిన్యూ కోడ్: ప్రస్తుతం అమలు లో ఉన్న భూ చట్టాలనన్నిటిని కలిపి ఒక సమగ్ర భూ చట్టాన్ని రూపొందించాలి. మూడేళ్ళ క్రింద ఉత్తర్ ప్రదేశ్ అన్ని భూచట్టాలని కలిపి రెవిన్యూ కోడ్ ను రూపొందించుకుంది. ఇది అధికారులకి, రైతులకి కూడా చాలా ఉపయుక్తంగా ఉందని అనుభవాలు చెప్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1999 లో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. అసెంబ్లీ రెవిన్యూ కోడ్ ను ఆమోదించింది కానీ రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదు. తెలంగాణా లో దాదాపు 150 భూమి చట్టాలు ఉన్నాయి. వీటిని అన్ని కలిపి ఒక సమగ్ర రెవిన్యూ కోడ్ / రెవెన్యూ చట్టం / భూమి చట్టాన్ని రూపొందించాలి.
C. టైటిల్ గారంటీ చట్టం: టైటిల్ గారంటీ వ్యవస్థ వస్తే భూయజమానికి భద్రమైన భూమి హక్కు దక్కుతుంది. దీనివలన చేకూరే లాభాలు చాలా ఉన్నాయి. హక్కుల చిక్కులు తీరుతాయి. భూ సమస్యలు తగ్గుతాయి. భూ వివాదాలు, భూ సంబంధిత నేరాలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముప్పై ఏళ్లుగా దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డి.సి. వాద్వా ఆధ్వర్యంలో నియమించిన ఏక సభ్య కమిషన్ 1989 లోనే టైటిల్ గారంటీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2011 లో ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ టైటిల్ గ్యారంటీ చట్టాలు చేసాయి. గోవా, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
D. ట్రిబ్యునల్ల ఏర్పాటు: జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ వివాద పరిస్కారానికి ట్రిబునల్లను ఏర్పాటు చెయ్యాలి. బీహార్ రాష్ట్రము భూవివాద పరిస్కారాల చట్టం, భూమి ట్రిబ్యూనల్ చట్టం రూపొందించి మంచి ఫలితాలు సాధించింది.
E. పారాలీగల్ వ్యవస్థ: పేదలకు అండగా ఉంటూ న్యాయ సలహాలు, సహాయం అందించే వ్యవస్థ ఉండాలి. పేద కుటుంబాలలో డిగ్రీ చదువుకున్న యువతి యువకులకు భూ చట్టాలు, భూమి సర్వే పై శిక్షణ ఇచ్చి ప్రతి మండలానికి ఒక పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ను నియమించాలి. ప్రతి డివిజన్ కేంద్రం లో ఒక భూన్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలి. ఈ కేంద్రం లో ఒక లాయర్ని, ఒక రెవిన్యూ నిపుణున్ని నియమించాలి. ఈ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించాలి. ఇలాంటి వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. ఈ వ్యవస్థ మెరుగైన ఫలితాలు ఇచ్చింది. పలు కమిటీలు ఈ వ్యవస్థను అభినందించాయి. ప్రతి రాష్ట్రంలో దీనిని అమలు చేయాలనీ కేంద్రం సూచించింది.
F. భూపరిపాలన: భూమికి సంబదించిన అన్ని శాఖలు ఒక గొడుగు క్రిందకు రావాలి. సిబ్బందికి తగిన శిక్షణ ఉండాలి. భూపరిపాలన అకాడెమి ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది.
భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాదు. భూమి ఒక గుర్తింపు, అది ఒక బలం, అభివృద్ధికి ఇరుసు. కోట్ల మందికి భూమే జీవితం. అందుకే భూమి పై హక్కులు, భూపరిపాలన ఎల్లపుడూ చాలా కీలకమైన అంశమే. భూ పరిపాలన సరిగ్గ ఉంటేనే సాగు సాఫీగా సాగుతుంది, అభివృద్ధి ఆశించినమేరకు ఉంటుంది. భూయజమానులు, రైతుల సంతృప్తే కొలమానంగా భూపరిపాలన, రెవిన్యూ వ్యవస్థలో మార్పులు చెయ్యాలి. భూపరిపాలన పై రాజ్యాంగాన్ని అంతర్జాతీయ సూత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు చెయ్యాలి.
ఎం సునీల్ కుమార్ (భూమి సునీల్)
భూచట్టాల నిపుణులు, న్యాయవాది
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు
డైరెక్టర్, సాధనా అకాడమీ ఆఫ్ ఇంపారేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ (సెయిల్స్)
ప్రెసిడెంట్, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్)
సెల్: 9000222674
ఈ మెయిల్: landsunilindia@gmail.com
యూట్యూబ్: భూమి సంగతులు – https://www.youtube.com/channel/UCYntJbnjQGoY_PbeF09z7VA?view_as=subscriber
మిత్రులారా ఈ రోజు కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై
“రైతు స్వరాజ్య వేదిక”విశ్లేషణ, పత్రికా ప్రకటన.
2020 ఫిబ్రవరి 1 వ తేదీ;
గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచటంలో బడ్జెట్ విఫలం; ఆర్ధిక వ్యవస్థను మాంద్యం నుండి బయటికి తెచ్చే బదులు ఈ బడ్జెట్ బడా కార్పొరేట్ కంపెనీల లాభాలను పెంచటానికే తోడ్పడుతుంది.
కేంద్ర బడ్జెట్ గురించి పూర్తిగా విశ్లేషిస్తూ రైతు స్వరాజ్యవేదిక నాయకులు ఈ బడ్జెట్ రైతాంగం మరియు గ్రామీణ ప్రాంత ప్రజలని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ ను కొనుగోలు శక్తిని పెంచి తద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచటం అనేది భారత దేశ ఆర్ధిక వ్యవస్థ సత్వర అవసరం కాగా ఈ బడ్జెట్ గ్రామీణ రంగాన్ని బలోపేతం చేయటానికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు విస్సా కిరణ్ కుమార్, “మొత్తం కేంద్ర బడ్జెట్లో ఈ రంగాలకు 2019-20లో 9.61% కేటాయింపు ఉండగా, 2020-21లో కేవలం 9.30%కి పడిపోయింది. 2019-20 బడ్జెట్ లో వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణ అభివృద్ధికి చేసిన మొత్తం కేటాయింపు 2.68 లక్షల కోట్లు, దీనిని ఈ సంవత్సరం బడ్జెట్ లో నామమాత్రంగా 2.83 లక్షల కోట్లకు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే తరుగుదల అనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలకి, రైతాంగానికి మరింత కేటాయింపులు ఉండవలసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి నిర్లక్ష్య వైఖరి అవలంబించింది,” అని అన్నారు.
ఇది రైతుల ఆదాయాలు, పొదుపులు, ఆహార భద్రత లేక ఉపాధి మొదలైనవాటిని మెరుగు పరచటానికి ఏవిధంగానూ దారితీయదు – అవి ప్రస్తుతం ఏర్పడి వున్న ఆర్ధిక మాంద్యం నుండి ఆర్ధిక వ్యవస్థను బయట పడవేయటానికి అత్యవసరం. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించే అతి పెద్ద కార్యక్రమమైన జాతీయ ఉపాధి హామీ పధకానికి బడ్జెట్ కేటాయింపును 71,001 కోట్ల రూపాయల నుండి (2019-20) ప్రస్తుత బడ్జెట్ లో 61,500 కోట్ల రూపాయలకు తగ్గించారు. నిజానికి రాష్ట్రాలు ఈ పధకానికి లక్ష కోట్ల బడ్జెట్ అవసరమని డిమాండ్ చేయగా 9,500 కోట్ల రూపాయలను తగ్గించారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పధకం పి ఎం కిసాన్ పధకం కింద ఒకొక్క రైతు కుటుంబానికీ అందించే 6000 రూపాయలు కేవలం 6.12 కోట్ల మంది రైతులకు మాత్రమే అందింది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఈ పధకాన్ని వర్తింపచేయనే లేదు. ఈ లోగా గత ఐదు ఏళ్లలో వ్యవసాయ ఉత్పాదకాల ధరలు 33% నుండి 100% పెరిగాయి, జీవన వ్యయం రెట్టింపైంది.
రైతు స్వరాజ్య వేదిక కమిటీ సభ్యులు ఆశాలత గారు మాట్లాడుతూ, “2020 బడ్జెట్ వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటల సేకరణ, నిల్వ, శుద్ధి, బీమా, పంట బీమా మొదలైన వాటిలోకి కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీలు మరింత ఎక్కువగా చొరబడటాన్ని ప్రతిపాదిస్తుంది. అది రైతులకు అధిక ఉత్పాదకాల ధరలు, తక్కువ పంట ధరలు, తెగనమ్ముకోవటం, పంట నష్టం మొదలైనవాటి నుండి ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. రైతుల భూములను కౌలుకు తీసుకోవటం, వారిని మరింత అప్పుల ఊబిలోకి తోయటం, వారి పంటలను మరింత తక్కువ ధరలకు కొనటం, ఆహార శుద్ధి ద్వారా అధిక లాభాలు పొందటం, మార్కెటింగ్ చేయటం ద్వారా కంపెనీలు రైతులను దోపిడీ చేయటం పెరుగుతుంది.” అని అన్నారు.
బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే కేటాయింపుల ప్రకటనకు చేసిన ఖర్చుకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడవుతుంది. 2018-19 బడ్జెట్ లో 22,000 గ్రామీణ మార్కెట్లను గ్రామీణ్ అగ్రికల్చర్ మర్కెట్స్(GrAM) లుగా వాటి స్థాయిని పెంచటం జరుగుతుంది అని వాగ్దానం చేయటం జరిగింది. కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ 0.5% నిధులు మాత్రమే ఖర్చు చేశారు. కనీస మద్దతు ధర ప్రతి రైతుకు అందుతుందని, దాని కోసం PM -AASHA పధకాన్ని స్థాపించారని 2018-19 బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి వాగ్దానం చేశారు. 2019-20 సంవత్సరంలో అందుకోసం కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగా, దానిలో 321 కోట్ల రూపాలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్ లో ఆ కేటాయింపును 500 కోట్లకు తగ్గించారు. గత రెండు సంవత్సరాలలో చాలా పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించనేలేదు. నిజానికి మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధర అందించాల్సిన సమయం అదే, కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2017-18 బడ్జెట్ ఉపన్యాసం లో 10,881 కోట్ల “పాడి పరిశ్రమకు మౌలిక సదుపాయాల అభ్రివృధి నిధి”ని ప్రకటించారు, దానిని 3 ఏళ్లలో ఖర్చు చేయవలసి వుంది. అయితే ఇప్పటివరకు పెట్టిన అసలు ఖర్చు కేవలం 440 కోట్లరూపాయలు మాత్రమే. ప్రస్తుత బడ్జెట్ లో దీని కోసం కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అదే విధంగా ప్రధాన మంత్రి సించాయి యోజన అనే చిన్నతరహా నీటి పారుదల కోసం 3500 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 2019-20 లో కేవలం 2032 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టం, మరియు ఏ.పి.ఎం.సి. మోడల్ చట్టాలు అమలు చెయ్యమని రాష్ట్రాలకు సూచన ఇచ్చింది కాని జాతీయ గ్రామీణ ఉపాధి పధకం, గ్రామీణ వేతనాలు, నీటి పారుదల, డీజిల్-విద్యుచ్ఛక్తి -విత్తనాలు-ఎరువులకు సబ్సిడీలు, భూమిలేనివారు, వ్యవసాయ కూలీలు, బటాయిదారుల సమస్యలు మొదలైనవాటికి బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేవు.
రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు నవీన్ కుమార్ మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వ్యవసాయ రుణాన్ని 15 లక్షల కోట్లకు పెంచింది, కానీ ఈ రుణాలు చిన్న సన్నకారు రైతులకు, కౌలు రైతులకు, ఆదివాసీ రైతులకు అందటానికి ఎటువంటి వ్యవస్థాగత మార్పులు సూచించలేదు. వ్యవస్థాగత అప్పులు అందక అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఈ రైతులే, అయినప్పటికీ వారి ప్రస్తావన లేదు. అంటే ఈ రుణాలలో ఎక్కువ భాగం పెద్ద వ్యాపార సంస్థలకు అందుతుంది, కంపెనీలు తయారు చేసే అధిక ఖర్చు గల ఉత్పాదకాలు, యంత్రాల అమ్మకాలను పెంచటానికే పోతుంది . రైతులు తమ భూములను తనఖా పెట్టుకోకుండా నివారించటానికి వారికి ఎటువంటి సహాయం లేదు . ప్రభుత్వం ఇటీవలే కార్పొరేట్లు చెల్లించకుండా ఉండిపోయిన 2 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి వారికి అదనంగా 1. 45 లక్ష కోట్ల పన్ను రాయితీలను కల్పించింది,” అని అన్నారు.
ఈ బడ్జెట్ లో సమగ్ర ఉత్పత్తి ఖర్చు C2 కు అదనంగా కనీసం 50% లాభం చేకూర్చే గిట్టుబాటు ధరకు హామీ కల్పించే కేటాయింపులు చేస్తారని, అలాగే PM-AASHA పధకానికి మరింత నిధులు ఇస్తారని ఆశించారు. అప్పులు, పంట నష్టాల నుండి ఉపశమనం, యథేచ్ఛగా తిరిగే జంతువుల నుండి రక్షణ, పంట బీమా మొదలైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వుండింది. కానీ ఇవేవీ అంటుకోలేదు “అని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. గత 3 ఏళ్లలో రైతులు నష్టాలు పాలవగా ప్రయివేటు కంపెనీలు పంట బీమా నుండి 18830 కోట్లు సంపాదించాయి .
రైతు స్వరాజ్య వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్నితీవ్రంగా విమర్శిస్తూ “ఇది చాలా నిరాశాజనకంగా వుంది. ఈ దేశ రైతాంగానికి ఎటువంటి చోటు లేని బడ్జెట్ ఇది. ప్రభుత్వానికి కంపెనీలే గాని రైతుల సమస్యల గురించి పట్టదు అని మోడీ ప్రభుత్వం మరొక సారి ప్రకటించింది,” అని అన్నారు.
విషముష్ఠి
విషముష్టి చెట్టును కొన్ని ప్రాంతాలలో ముషిణి, ముషిడి ముష్ఠి అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారు 10-15 మీటర్ల వరకు పెరిగే వృక్షం. పత్రాలు అండాకారంలో ఉండి ప్రతి కణుపుకు రెండు ఉంటాయి. పత్రాలు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి దళసరిగా ఉంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. ఫలాలు గుండ్రంగా ఉసిరి కాయ పరిమాణంలో ఉండి, పండినపుడు కాషాయ రంగులో ఉంటాయి. విత్తనాలు తప్పడగా, గుండ్రంగా ఉంటాయి. ఫలంలో గుజ్జు తెల్లగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పుష్పాలు మార్చి – జూన్ మాసాలలో లభిస్తాయి. విత్తనాలు ఆగస్టు – ఫిబ్రవరి మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా అరణ్యాల లోను, కొన్ని ప్రాంతాలలో పొలాల కంచెల వెంబడి పెరుగుతుంది.
దీనిని జీవ రసాయనంగా, ఎలుకల నివారణలో, మార్కెట్లో ఎలుకల నిర్మూలన రసాయన మందులు రాని సమయంలో వాడుతుండేవారు. ప్రస్తుతం అనేక రకాల ప్రత్యమ్నాయ పద్ధతులు ఎలుకల నిర్మూలనలో లభ్యమవుతుండడం వల్ల విషముష్ఠిని వుపయోగించుట లేదు. విషముష్ఠి ఆకులు చేదుగా వుంటాయి. ఈ ఆకులలో వుండే రసాయనాలు క్రిమి సంహారకంగా పని చేస్తాయి. అందువల్ల ఆకులను ”పంచపత్ర కషాయం” (వివిధ ఆకుల ద్రావణం)లో రైతులు ఇతర ఆకులలో కలిపి వుపయోగించవచ్చు.
విషముష్ఠి ఆకుల కషాయానికి టేకు చెట్టు ఆకులను తినే గొంగళి పురుగులను నివారించే గుణం కలిగి వుందని డా|| సెంథిల్ కుమార్ 2012 (తమిళనాడు) పరిశోధనలు తెలుపుతున్నాయి. దోమల లార్వాను నిర్మూలించే గుణం విషముష్ఠి ద్రావణానికి వుందని డా|| ప్రామ్సిరి (2006) పరిశోధనలలో నిరూపితమైనది.
విషముష్ఠి ఆకుల కషాయాన్ని (పంచపత్ర కషాయం) వుపయోగించి వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు (తెల్ల కంకి)ను నివారించడం ఈ రచయిత చూడటం జరిగింది. ఈ కషాయాన్ని 10 రోజుల వ్యవధిలతో 2 సార్లు వుపయోగించి ఈ పురుగును సమర్ధవంతంగా నివారించవచ్చు.
విషముష్ఠి ఆకులను పచ్చిరొట్ట ఎరువుగా వుపయోగించిన వరి పొలాల్లో చీడపీడల బెడద చాల తక్కువగా వుండటం, ఆదివాసి ప్రాంతాలలో గమనించడం జరిగింది.
వంగలో కాండము, కాయతొలుచు పురుగు
పురుగు ఆశించు కాలం: అన్ని సమయాల్లో రావచ్చు
నివారణ :
- ఈ పురుగు ఒక్క వంగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది.
- వాల్చిన తలలను, తొలచిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి.
- ఎకరానికి 50 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతి పర్యవేక్షణ మాత్రమే కాకుండా మగ రెక్కల పురుగులను బందించి సమర్ధవంతంగా అదుపుచేయవచ్చు.
- 5% వేప కషాయం పిచికారి చేసి పొలంలో తల్లిపురుగు గుడ్లు పెట్టకుండా పారద్రోలవచ్చు.
