Successful leaders demonstrate the following five leadership qualities in their personal and professional lives, inspiring others to take action and set a course for future success. Strong leaders also practice key behaviors on a regular basis in order to strengthen the positive impact of these qualities.

1. They are self-aware and prioritize personal development.

Effective leaders focus on developing their emotional intelligence, Goode says. Leaders that work to refine this quality are more adaptive, resilient, and accepting of feedback from others. They are also effective listeners and open to change.

How You Can Improve:

The following behaviors will help you focus on your self-awareness and personal development to develop this important leadership quality.

2. They focus on developing others.

This leadership quality builds on the principles of the situational leadership theory, which suggests that effective leaders adapt to whether an individual or group is ready, willing, and able to take specific action. Delegating, coaching, and mentoring are important tasks for situational leadership, Goode says.

How You Can Improve:

These behaviors will help you demonstrate leadership ability by developing others within an organization.

3. They encourage strategic thinking, innovation, and action.

“As a leader, you have to look forward. You have to think about where the organization is going,” Goode says.

Leaders must consider internal organizational factors, such as product roadmaps and staffing needs, as well as external factors, including government regulations and technology advancement, when making strategic business decisions.

How You Can Improve:

Emphasizing the following behaviors will help develop leadership qualities related to strategic thinking, innovation, and action.

4. They are ethical and civic-minded.

Strong leaders consider the ethical consequences of the decisions that they make—for both their customers and their teams.

How You Can Improve:

Taking these behaviors into account will increase your awareness of ethical practice and civic-mindedness, which reflects personal concern for the benefit of your entire organization and the community as a whole.

5. They practice effective cross-cultural communication.

Respected leaders are able to clearly communicate with individuals, business units, the entire company, and to stakeholders outside the organization. In an increasingly global economy, leaders must also acknowledge and respect different communication traditions, Goode says.

How You Can Improve:

Practicing these behaviors will help leaders increase the effectiveness of their communication.

About Brian Eastwood
Brian Eastwood is a freelance writer with more than 15 years of experience as a journalist. In his career, he has covered small-town politics, enterprise information technology, leadership strategy, and a variety of healthcare topics.
https://www.northeastern.edu/graduate/blog/top-5-leadership-qualities/

సగటు దిగుబడులు – పంట రుణం – పంటల బీమా – ఆదాయాలు – ఆరోగ్య సమస్యలు

(తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఒక ప్రధానమైన పంట) 

1. 2019 ఖరీఫ్‌ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) మించి ఈ సంవత్సరం మరో 2 శాతం ఎక్కువ సాగయింది. 

2.మొత్తం సాధారణ పంటసాగు విస్తీర్ణం తెలంగాణాలో 43,34,487 హెక్టార్లు కాగా, అందులో 40 శాతం విస్తీర్ణంలో పత్తే సాగవుతున్నదంటే ఈ పంటకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. 

3. తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లాలో పంట సాగు భూములు లేవు. మిగిలిన 32 జిల్లాలకుగాను, ఒక్క మేడ్చల్‌ తప్ప, మిగిలిన 31 జిల్లాలలోనూ పత్తి సాగవుతున్నది. అన్ని రకాల భూములలోనూ పత్తిని సాగు చేస్తున్నారు. నీటి పారుదల సౌకర్యాల క్రిందే కాకుండా, వర్షాధార భూములలోనూ పత్తి పంట సాగు చేస్తున్నారు. దీని వల్ల ఆయా జిల్లాలలో సగటు దిగుబడుల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి. 

4. పత్తి సాగు విస్తీర్ణం పెరగడంపై రైతు స్వరాజ్య వేదిక చేసిన ఒక అధ్యయనం ప్రకారం, పత్తి సాగుకు బ్యాంకులు అందించే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (ప్రస్తుతం హెక్టారుకు 87,500 రూపాయలు) కూడా ఒక ప్రధాన కారణమని అర్థం అయింది. అలాగే రాష్ట్రంలో కోతులు, అడవి పందుల వల్ల ఇతర పంటలు సాగు చేసే పరిస్థితి లేదనీ, ఈ జంతువులు పత్తి జోలికి రావుగనుక ఈ పంటను సాగు చేస్తున్నామనీ రైతులు చెప్పారు. వాస్తవానికి తాజా పరిస్థితులలో కోతులు, ఒక దశలో పత్తి కాయలను చెట్ల నుంచి తెంచి, కొరికి పడేస్తున్నాయని రైతులే చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులను, ఒక మేరకు పత్తి తట్టుకుంటుందనీ, మిగిలిన పంటలు తట్టుకోలేవనీ రైతుల అభిప్రాయం. పత్తిలో కనీస దిగుబడి తప్పకుండా వస్తుందని, పైగా పండగల సీజన్‌ అయిన అక్టోబర్‌, నవంబర్‌లలో పత్తి చేతికి వస్తుంది కనుక, రైతుల డబ్బు అవసరాలను తీరుస్తుందని, పత్తికి మార్కెటింగ్‌ వ్యవస్థ గ్రామ స్థాయి వరకు విస్తరించి ఉందని, మిగిలిన ఏ పంటకు ఇంత గ్యారంటీ లేదని, అందుకే పత్తిని సాగు చేస్తున్నామని రైతుల అభిప్రాయం.

5. దేశ వ్యాపితంగా పత్తి పంట సాగు, వినియోగం వివరాలు 

వ.పత్తి (లక్షల బేళ్ళు)  సి.ఎ.బి అంచనా2017-182018-19
1విస్తీర్ణం (ల. హె)124.3123.5
2.పత్తి ఉత్పత్తి370.0361.0
3పాత నిల్వ43.847.1
4దిగుమతులు15.815.0
5మొత్తం పప్లై429.6423.1
6.మిల్లుల వినియోగం275.9278.0
7.ఎస్‌.ఎస్‌.ఐ.వినియోగం27.227.0
8.నాన్‌.వినియోగం11.512.0
9.మొత్తం314.6317.0
10ఎగుమతులు67.865.0
11మొత్తం అవసరం382.4382.0
12.ముగింపు నిల్వ47.141.1

6. పత్తి ఉత్పత్తి, వినియోగం ప్రస్తుతం బేలన్స్‌ అవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి విస్తీర్ణం, దిగుబడులు, ధరలు కూడా భారతదేశ మార్కెట్‌ను, రైతులను ప్రభావితం చేస్తున్నాయి. మన మిల్లుల అవసరాలను ప్రస్తుత పత్తి ఉత్పత్తి తీర్చగలుగు తున్నప్పటికీ, ఎగుమతులలో స్థబ్ధత వుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు, భారత మిల్లుల యాజమానులు కూడా, పత్తి దిగుమతుల కోసం పరుగులెత్తు తున్నారు. లేదా భారతదేశ మార్కెట్‌లో పత్తి ధరలను పడేస్తున్నారు. ఫలితంగా రైతులు, కేవలం వర్షాభావ పరిస్థితులలో దిగుబడులు తగ్గి మాత్రమే కాకుండా, పత్తి బాగా పండిన సందర్భాలలో కూడా రైతులకు ధరలు అందక నష్టపోతున్నారు. 

7. కనీస మద్ధతు ధరలు (ఎం.ఎస్‌.పి) ప్రకటించే పంటలలో పత్తి ఉత్పత్తికి సంబంధించి తెలంగాణా రాష్ట్రం 14 శాతం వాటాను కలిగి వుంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం పత్తి సగటు దిగుబడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హెక్టారుకు 20 క్వింటాళ్ళు (ఎకరానికి 800 కిలోలు). వ్యవసాయ ఖర్చుల, ధరల నిర్ణాయక కమీషన్‌ (సి.ఎ.సి.పి) అంచనా ప్రకారం హెక్టారుకు 16 క్వింటాళ్ళ 63 కిలోలు (ఎకరానికి 660 కిలోలు). 

8. పత్తి పంటకు సంబంధించి సి.ఎ.సి.పి నివేదికలో మరికొన్ని అంశాలు మనం పరిశీలించాలి. 2019-20 సంవత్సరానికి కనీస మద్ధతు ధరలను ప్రకటించడానికి సాధారణంగా సి.ఎ.సి.పి. 2015-16, 2016-17 సంవత్సరాల ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నది. ఈ నివేదిక ప్రకారం పత్తి పంట హెక్టారు ఉత్పత్తి ఖర్చు 2015-16లో 73,661.72 రూ.లు కాగా, అది 2016-17కు 83,117.08 రూ.లకు (అంటే హెక్టారుకు 10 వేల రూపాయలు) పెరిగింది. కానీ సగటు దిగుబడుల విషయానికి వస్తే 2015-16లో హెక్టారుకు 14.52 క్వింటాళ్ళు కాగా, 2016-17లో అది 18.29 క్వింటాళ్ళకు పెరిగింది. ఫలితంగా పంట సాగు ఖర్చు (ఎ2) + కుటుంబ శ్రమ విలువ (ఎఫ్‌.ఎల్‌) కలిపి 2015-16లో క్వింటాలుకు 3,633.23 కాగా 2016-17లో క్వింటాలుకు 2,935.34 రూపాయలకు పడిపోయింది. సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) క్వింటాలుకు 5,067.31 రూపాయల నుండి 4,544.69 రూపాయలకు పడిపోయింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంట సాగు వివరాలు. తెలంగాణా రాష్ట్ర వివరాలు సి.ఎ.సి.పి. నివేదికలో లేవు. దేశ ఉత్పత్తిలో 14 శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణా రాష్ట్ర పత్తి పంట వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సి.ఎ.సి.పి.కి అందించడం లేదో మనకు అర్థం కాదు. దాని వల్ల మొత్తంగా మద్ధతు ధరలు పొందడంలో పత్తి రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవం. 

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంట ఉత్పత్తి ఖర్చులు (హెక్టారుకు)

క్రఅంశం2015-162016-17
1మానవ శ్రమ(లేబర్‌)18157.9618520.28
2.అటాచ్‌డ్‌ (పాలేరు)516.241614.88
3.ఫ్యామిలీ లేబర్‌7325.887824.76
4.మొత్తం26000.0827959.92
5.పశువుల శ్రమ1938.911639.02
6పశువుల శ్రమ(స్వంతం)4839.983814.92
7మొత్తం6778.895453.94
8.యంత్రాలు (కిరాయి)3919.024384.67
9.యంత్రాలు (స్వంతం)157.80250.57
10.మొత్తం4076.824635.24
11.విత్తనాలు4193.443670.89
12.రసాయన ఎరువులు6251.836484.81
13.సేంద్రియ ఎరువు608.62440.37
14.మొత్తం6860.459625.18
15.పురుగు విషాలు2806.992871.65
16.నీటి పారుదల187.10349.05
17.పెట్టుబ డి పై వడ్డీ1362.251376.33
18.ఇతర ఖర్చులు13.951.44
19.స్వంత భూమికి కౌలు 18023.7126670.33
20కౌలు భూమికి కౌలు38.3321.65
21.భూమిశిస్తు సెస్సులు0.050.04
22పరికరాలు, బిల్డింగుల విలువలో కోత470.04422.32
23.స్థిర పెట్టుబ డిపై వడ్డీ2849.622759.10
24.మొత్తం ఖర్చు73661.7283117.08
25.పత్తి సగటు దిగుబడి (క్విం)14.5218.29
26.ఎ-2 + ఎఫ్‌.ఎల్‌ (క్విం)3633.232935.34
27.సి-25067.314544.69

9. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ 2019-20 సంవత్సరం అంచనా ప్రకారం దిగుబడి 20 క్వింటాళ్ళు పత్తి పంట సమగ్ర ఉత్పత్తి ఖర్చు అంచనా 5,355 రూపాయలు (20 క్వింటాళ్ళుకు) కాగా సి.ఎ.సి.పి. అంచనా 5,103 రూపాయలు (16.63 

క్వింటాళ్ళు). 2019-20 సంవత్సరానికి ప్రకటించిన కనీస మద్ధతు ధర క్వింటాలుకు 5,550 రూపాయలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల అంచనా ప్రకారం రైతుకు క్వింటాలుకు నికరంగా మిగిలేవి 145 రూపాయలు. అంటే ఎకరానికి 8 క్వింటాళ్ళ చొప్పున నికర మిగులు 1,160 రూపాయలు. 8 నెలల పంటకు ఎకరానికి నికర మిగులు ఇది. సి.ఎ.సి.పి. లెక్క ప్రకారం చూసినా క్వింటాలుకు నికర మిగులు 497 రూపాయలు. అంటే ఎకరానికి 660 కిలోలకు గాను సుమారు 3,280 రూపాయలు మాత్రమే నికర మిగులు. 

10. పైగా సమగ్ర ఉత్పత్తి ఖర్చులలో పంట బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు కలపడం లేదు. ఇది కూడా కలిపితే ఉత్పత్తి ఖర్చు మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధరలను ప్రకటించేటప్పుడు పంట సాగు ఖర్చు (ఎ2) + కుటుంబ శ్రమ (ఎఫ్‌.ఎల్‌)ను దృష్టిలో వుంచుకుని, కొంత మొత్తాన్ని కలిపి మద్ధతు ధరలను ప్రకటిస్తున్నది. సి2+50 శాతం ప్రాతిపదికన కనీస మద్ధతు ధరను నిర్ణయించాలని స్వామినాథన్‌ కమీషన్‌ సిఫారసు చేసినా, దానిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

11. తెలంగాణా రాష్ట్రంలో పత్తి పంటకు హెక్టారుకు 87,500 రూ.లు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ప్రాతిపదికగా తీసుకుని పంట బీమా మొత్తాన్ని నిర్ణయించారు. అంటే బ్యాంకులు ఇంత మొత్తాన్ని రైతుకు పంట రుణంగా ఇవ్వాలన్నమాట. పైగా బీమా మార్గదర్శకాల ప్రకారం బీమా ప్రీమియం మొత్తాన్ని రైతుకు ఇచ్చే రుణానికి అదనంగా కలిపి, పంట రుణంగా ఇవ్వాలి. కానీ చాలా సందర్భాలలో బ్యాంకులు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారమే రుణాలు ఇవ్వడం లేదు. 

12. 2019 మే 3న విడుదలైన వాతావరణ ఆధారిత పంట బీమా నోటిఫికేషన్‌ ప్రకారం క్లస్టర్‌ 1, క్టస్టర్‌ 3 జిల్లాలకు ఇఫ్కో – టోక్యో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, క్లస్టర్‌ 3, 4, 5, 6 లకు వ్యవసాయ బీమా కంపనీ పత్తి పంటకు బీమా చేస్తున్నాయి. ఈ కంపనీలు వసూలు చేస్తున్న మొత్తం ప్రీమియం రేట్లను చూస్తే, 5 జిల్లాలలో 22.25 శాతం, 6 జిల్లాలలో 22 శాతం 7 జిల్లాలలో 25 శాతం, 5 జిల్లాలలో 20 శాతం, 8 జిల్లాలో 15 శాతం చొప్పున ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ప్రీమియం మొత్తంలో 5 శాతం రైతు వాటాగా చెల్లిస్తుండగా, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తున్నాయి. 

13. అంటే బీమా ప్రీమియం క్రింద రైతు వాటాగా హెక్టారుకు 4,375 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంటే ఎకరానికి కనీసం 1780 రూపాయలు అన్నమాట. రైతుకు నికర మిగులు, బీమా ప్రీమియం చెల్లింపుకు సరిపోయినంత కూడా లేదన్నమాట. నిజంగా బ్యాంకులు రైతులకు పంట రుణం ఇచ్చి, బీమా ప్రీమియం మినహాయించు కుంటే, ప్రకృతి వైపరిత్యాల సమయంలో రైతుకు పరిహారం వస్తుంది. లేనట్లయితే రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది. మరీ ముఖ్యంగా వర్షాధార ప్రాంత పత్తి రైతులు నష్టపోతారు.

14. ఏఏ సందర్భాలలో పత్తి రైతుకు పరిహారం అందుతుందో కూడా పరిశీలించాలి. ఈ పరిశీలనకు అత్యంత కీలకమైనది, నిర్ధిష్ట మండలంలో జూన్‌ నెల నుండీ సెప్టెంబర్‌ వరకూ కురిసిన వర్షపాతం రోజువారీ సమాచారం. 

కానీ, రైతులకు రోజు వారీగా, నెలల వారీగా, ప్రతి మండలం వారీగా, ఎంత వర్షపాతం ఉన్నదో తెలవడం లేదు. కాబట్టి తమకు ఇన్సూరెన్స్‌ వస్తుందో రాదో కూడా రైతులకు అంచనా ఉండడం లేదు.

పత్తి పంటకు బీమా ప్రీమియం అత్యధికంగా ఉంది.

బీమా మొత్తం హెక్టారుకు – 87,500 రూపాయలలో 

25 శాతం ప్రీమియం అంటే – 21,875/-

20 శాతం ప్రీమియం అంటే – 17,500/-

రైతు చెల్లించే 5 శాతం ప్రీమియం అంటే   – 4,375/- 

‘కాటనా’మిక్స్‌ (2019-20)

 తెలంగాణలో పత్తి పంట సాగు – పరిస్థితి

క్ర.జిల్లా పేరుసాధారణ సాగు విస్తీర్ణం (హె.)పత్తి సాగు విస్తీర్ణం(హె.)
1.రంగారెడ్డి1,67,98473,185
2.మేడ్చల్‌ మల్కాజ్‌గిరి7,183124
3.వికారాబాద్‌1,72,15344,239
4.నిజామాబాద్‌1,69,5401,292
5.కామారెెడ్డి1,45,27515,468
6.మెదక్‌83,37319,350
7.సంగారెడ్డి2,24,1371,22,344
8.సిద్దిపేట1,95,83974,936
9.మహబూబ్‌నగర్‌1,17,36834,101
10.నాగర్‌కర్నూల్‌2,16,7031,23,055
11.వనపర్తి80,4052,918
12.గద్వాల్‌1,33,46862,228
13.నారాయణపేట1,37,38761,630
14.నల్గొండ3,35,0082,35,408
15.సూర్యాపేట1,57,52147,529
16.యాదాద్రి1,23,42659,323
17.వరంగల్‌ (రూరల్‌)1,38,25965,717
18.వరంగల్‌ (అర్బన్‌)55,79030,871
19.జయశంకర్‌85,22849,722
20.జనగామ1,07,47359,631
21.మహబూబాబాద్‌1,20,87645,590
22.ములుగు54,28111,568
23.ఖమ్మం2,30,49888,148
24.భద్రాద్రి1,24,65146,524
25.కరీంనగర్‌1,11,16942,987
26.జగిత్యాల1,19,1498,861
27.పెద్దాపల్లి85,95328,698
28.రాజన్న సిరిసిల్లా76,62652,641
29.ఆదిలాబాద్‌1,93,0721,32,047
30.మంచిర్యాల94,26056,860
31.నిర్మల్‌1,45,98257,514
32.అసిఫాబాద్‌124,4651,05,009
మొత్తం43,34,48718,59,518

పత్తి పంటకు వాతావరణ ఆధారిత బీమా

1. నోటిఫికేషన్‌ తేది: 3-5-2019

2. మేడ్చల్‌ తప్ప అన్ని జిల్లాలు

3. క్లస్టర్‌ – 1, క్టస్టర్‌ -3 లకు ఇఫ్‌-కో, టోక్యో జనరల్‌ ఇన్యూరెన్స్‌ కంపనీ, క్టస్టర్‌ -2, 4, 5, 6 క్లస్టర్‌ ఎ.ఐ.సి. – బాధ్యత

4. పత్తి పంటకు బీమా మొత్తం – 87500 / హెక్టారుకు

1కొమురం భీం22 శాతం
2.ఆదిలాబాద్‌22 శాతం
3.మంచిర్యాల22 శాతం
4భూపాలపల్లి22  శాతం
5.సిద్ధిపేట22  శాతం
6.ములుగు22  శాతం
7.కామారెడ్డి25  శాతం
8.నిర్మల్‌20 శాతం
9.నిజామాబాద్‌25 శాతం
10.రంగారెడ్డి15 శాతం
11.యాదాద్రి20 శాతం
12.జగిత్యాల22.25 శాతం
13.జనగాం22.25 శాతం
14.కరీంనగర్‌22.25 శాతం
15.పెద్దపల్లి22.25 శాతం
16.సిరిసిల్ల22.25 శాతం
17.ఖమ్మం15 శాతం
18.మెదక్‌15 శాతం
19.నల్గొండ20 శాతం
20.సంగారెడ్డి15 శాతం
21.సూర్యాపేట15 శాతం
22.కొత్తగూడెం15 శాతం
23.నాగర్‌ కర్నూల్‌20 శాతం
24.వనపర్తి15 శాతం
25.వరంగల్‌ (అర్బన్‌)15 శాతం
26.గద్వాల్‌25 శాతం
27.మహబూబ్‌నగర్‌25 శాతం
28.నారాయణపేట25 శాతం
29.మహబూబాబాద్‌25 శాతం
30.వికారాబాద్‌25 శాతం
31.వరంగల్‌ (రూరల్‌)20 శాతం
32.మేడ్చల్‌
33.హైదరాబాద్‌

పత్తికి సంబంధించి మరికొన్ని గణాంకాలు

2019-20 సి.ఎ.సి.పి. నివేదిక నుండి 

1హెక్టారుకు పత్తిసాగులో వ్యవసాయ కూలీఖర్చు18,520.00
2.ఫ్యామిలీ లేబర్‌ (కుటుంబ శ్రమ)7,824.00
3.అటాచ్‌డ్‌ లేబర్‌ (పాలేరు)1,614.88
4.మొత్తం ూత్పత్తి ఖర్చు (హెక్టారుకు)83,117.08
5.హెక్టారుకు సగటు దిగుబడి18.29 క్విం.
6.క్వింటాలు ూత్పత్తి ఖర్చు (ఎ2 + ఎఫ్‌.ఎల్‌)4,544.69
7.ఎకరం ూత్పత్తి ఖర్చు (ఎ2 + ఎఫ్‌.ఎల్‌)33,000.00

కార్మిక శాఖ ప్రకటించిన కనీస వేతనాలు : 

1(జోన్‌ – 3) పాలేరు జీతం 85,134.00
2.పురుగు విషం చల్లడం (రోజుకి)315.30
3.పత్తి తీయడం315.30
4.కలుపు తీయడం 244.25
5.హైబ్రిడైజేషన్‌315.30
6.ూపాధి హామీ పని వేతనం (రోజుకు) 205.00
7.రాష్ట్రంలో కుటుంబాలకు అందిన సగటు పని దినాలు45

పత్తి నుండి వివిధ రకాల ూత్పత్తులు

– ఎగుమతి కోసం ూద్దేశించిన పత్తి బస్తాను క్యాండీ అంటారు. దీని బరువు – 365 కిలోలు.

– జిన్నింగ్‌ మిల్లులలో ప్యాకింగ్‌ బరువు – 170 కిలోలు (బేలు)

– క్వింటాలు పత్తి నుండి 33 కిలోల దూది, 66 కిలోల విత్తనాలు వస్తాయి. 

– జిన్నింగ్‌ మిల్లులకు, సి.సి.ఐ. 1 బేలు దూదికి 1150 రూపాయలు చెల్లిస్తుంది. 

– జిన్నింగ్‌ మిల్లుల ప్రాసెసింగ్‌లో వచ్చే గుడ్డి కాయల ధర కిలోకు 5-10 రూపాయలు.

– 1 క్వింటాలు పత్తి గింజల నుండి 18 కిలోల నూనె వస్తుంది. 

నాబార్డ్‌ సహకారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు మూడు రోజులు శిక్షణా తరగతులు సి.ఎస్‌.ఎ. ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు 25 ఎఫ్‌.పి.ఓ.ల నుండి సి.ఇ.ఓ.లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయరంగ సమస్యలు, ఎఫ్‌.పి.ఓ.ల నిర్మాణ లక్ష్యాలు, సి.ఇ.ఓ.ల బాధ్యతలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం గ్రామీణ ప్రజల లక్ష్యంగా తెచ్చిన వివిధ జీవోలు, చట్టాలు, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలపై కూడా వివరించాం. రెండవ రోజు శిక్షణా తరగతులలో ఈ సంఘాలకు లక్ష్యాలను నిర్ణయించుకోవడం, సంఘాల నిర్వహణలో మెళకువలు, సంఘాల నిర్వహణకు నియమ నిబంధనలు, రైతులలో వ్యవసాయంతో పాటు, ఇతర ఉపాధి అవకాశాలను ముఖ్యంగా ఇళ్ళ దగ్గర కోళ్ల పెంపకం, గ్రామంలో గొర్రెల, మేకల పెంపకం, అర ఎకరంలో కూరగాయల సాగు, జీవన ఎరువుల తయారీ, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తిని, సేంద్రియ వ్యవసాయంను ప్రోత్సహించడం తదితర అంశాలపై ఎఫ్‌.పి.ఓ.లు దృష్టి సాదించాలని, తద్వారా బయట కంపెనీల మోసాల నుండి బయటపడాలని చర్చ జరిగింది. తెలంగాణలో సి.ఎస్‌.ఎ. ప్రోత్సహించిన 11 ఎఫ్‌.పి.ఓ.లలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయా ఎఫ్‌.పి.ఓ.ల సి.ఇ.ఓ.లు వివరించారు. అలాగే ఎఫ్‌.పి.ఓ.ల నిర్వహణకు మేంటైన్‌ చేయాల్సిన రికార్డుల పై వివరించారు. మధ్యాహ్నం సి.ఎస్‌.ఎ., సహజ ఆహారం కార్యాలయాన్ని, ఆర్గానిక్‌ స్టోర్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహజ ఆహారం టీం ఆర్గానిక్‌ లంచ్‌ ఏర్పాటు చేసింది.

Centre for Sustainable Agriculture is a Regional Council for Participatory Guarantee System  for organic certification. In partnership with National Centre for Organic Farming  CSA has organised a two day training program on Participatory Guarantee System for ensuring organic integrity for the participants from AP and Telangana in Hyderabad on 27-28th November, 2019.